వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభం
న్యూఢిల్లీ: పదిరోజులవిరామం అనంతరం పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లారీల సమ్మె, ఉత్తరప్రదేశ్ రాజకీయాలే ప్రధానఅస్త్రాలుగా విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంఅందుకు సరైన ప్రణాళిక రచించింది.
మాయవతి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కేంద్రం జోక్యం చేసుకోకపోతే, అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ సోమవారం లోక్ సభలో అన్నారు. దీనిపై వాయిదా తీర్మానానికి అనుమతి ఇవ్వాలని ఆయనస్పీకర్ ను కోరారు. మరోవైపు, కాంగ్రెస్ లారీ సమ్మెటపై మంగళవారం ఇరుకునపెట్టేందుకు సమాయత్తమవుతోంది.
Story first published: Monday, April 21, 2003, 23:53 [IST]