ఆంధ్రాలోనూ సమ్మె కొనసాగుతోంది
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సమ్మెవిరమణ జరిగిందన్న వచ్చిన వార్తలను అఖిల భారతీయ మోటార్ట్రాన్స్ పోర్టర్ట్ ల సంఘం సోమవారం ప్రకటించింది. ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోని లారీసంఘం ప్రతినిధుల్లోని ఒక వర్గం సమ్మెవిరమించుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అన్ని రాష్ట్రాల్లోనూ లారీల సంఘాలన్ని నిరవధికంగా సమ్మెలో పాల్గొంటున్నట్లుట్రాన్స్ పోర్టర్ల సంఘం అధ్యక్షుడు దుమ్మాల్ తెలిపారు.
సమ్మెవిరమణ చేస్తేనే చర్చలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం నుంచి ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామన్నారు.
అలాగే, వంటగ్యాస్, పాలు, కూరగాయల సరాఫరా ప్రస్తుతం కొనసాగుతున్నా ప్రభుత్వం తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే, బుధవారం నుంచి వాటి సరఫరా కూడ ఆగిపోతుందని ఆయన హెచ్చరించారు. ఎనిమిదో రోజుకు చేరుకున్న దేశ వ్యాప్త సమ్మె మూలంగా కూరగాయల ధరలు ప్రతిరోజు విపరీతంగా పెరుగుతున్నాయి.