మగబిడ్డ పుడితే ఆడబిడ్డను ఇచ్చారు
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని నయాపూల్లో గల ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి శిశు మార్పిడివివాంలో చిక్కకుంది. తనకు మగబిడ్డ పుడితే వైద్యులు ఆడబిడ్డనుఅప్పగించారని ఒక మహిళ ఆందోళనకు దిగింది. ఈవిషయమై అన్ని పరీక్షలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటిండెంట్ హామీ ఇచ్చారు.
వివరాలు ఇలా వున్నాయి- రంగారెడ్డి జిల్లా షంషాబాద్ మండలం చిన్నగొల్లెపల్లి గ్రామానికి చెందిన లత అనే మహిళ ఈ నెల 14వ తేదీన నయాపూల్లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. పుట్టిన శిశువును ఆమెకు చూపించారు. శిశువు బలహీనంగా వుండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోపెట్టారు. ఆ తర్వాత శిశువును ఆమెకు అప్పగించారు. అయితే తనకు మగ బిడ్డ పుడితే ఆడబిడ్డనుఅప్పగించారని ఆమె ఆరోపిస్తోంది. పుట్టినప్పుడు శిశువును తాను చూశానని, తనకు పుట్టింది మగశిశువేనని ఆమె గట్టిగా వాదిస్తోంది. ఈ ఆరోపణపై ఆస్పత్రి సూపరింటిండెంట్నుఘెరావ్ చేశారు.
ఆస్పత్రిలో ఎక్కడో పొరపాటు జరిగి వుంటుందని, ఈవిషయమై విచారణకు ముగ్గురితో ఒక కమిటీ వేశామని, జన్యు పరీక్షలు కూడా నిర్వహిస్తామని, తద్వారా నిజానిజాలు తేల్చి చర్యలు తీసుకుంటామని సూపరింటిండెంట్ చెప్పారు.