వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డ్రగ్స్ వాడాలని చెప్పలేదు: శాప్
హైదరాబాద్: డోపింగ్ వ్యవహారంలో అథ్లెట్ ఉదయలక్ష్మి రాష్ట్ర అధికారులపై చేసిన ఆరోపణలమీద శాప్ విచారణ ప్రారంభించింది. అధికారుల సూచన మేరకే క్రీడాకారులు డ్రగ్స్ తీసుకున్నారని ఉదయలక్ష్మి ఆరోపించారు. నిరుడు జాతీయ క్రీడల్లో రాష్ట్ర క్రీడాకారులు డ్రగ్స్ తీసుకున్నాని తేలడంతో తీవ్ర సంచలనం రేగింది.
డ్రగ్స్ తీసుకోవాలని అధికారులు చెప్పారని ఒక్క ఉదయలక్ష్మి మాత్రమే చెప్తున్నారని, మిగతా క్రీడాకారలెవరూ ఆ మాట అనడం లేదని శాప్ చైర్మన్ ప్రసాద్ విలేకరులతో అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహకాలు ఇస్తోందని, ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వం జాతీయ క్రీడల సందర్భంగా మాత్రమే ప్రకటించలేదని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, April 22, 2003, 23:53 [IST]