వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాట్‌పై బిజెపి ఎంపిలకు పిఎం ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాల్యూ యాడెడ్‌ టాక్స్‌ (వ్యాట్‌)పై బహిరంగ ప్రకటనలు చేయవద్దని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి పార్టీ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. వ్యాట్‌పై తమ అభిప్రాయాలను ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీకి లేదా ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ తెలియజేయాలని, బహిరంగ ప్రకటనల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లవడించవద్దని ఆయన సూచించారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ చెరుకు రైతులు ఎదుర్కుంటున్న సమస్యపై ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని ప్రధాని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి, బిజెపి పార్లమెంటు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.

వ్యాట్‌ అమలుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరైంది కాదని, వ్యాట్‌ను అమలు చేయాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X