వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్త్రీరోగిపై జూనియర్ డాక్టర్ అత్యాచారం
గుంటూరు: ఒక జూనియర్ డాక్టర్ ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణతో గుంటూరు ఆస్పత్రి అట్టుడికిపోయింది. ఆరోపణ రుజువైతే జూనియర్ డాక్టర్పై చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు.
వివరాలు ఇలా ఉన్నాయి- ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఒక మహిళ థైరాయిడ్ వ్యాధితో ఆస్పత్రికి వెళ్లింది. ఈ వ్యాధికి పరీక్షలు చేయాలని చెప్పి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఆమెను తన రూమ్కి తీసికెళ్లాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపిస్తోంది. ఆమెపై నిపుణులు పరీక్షలు నిర్వహించారు. సాంపిల్స్ను ఫోరెన్సిక్ లాబ్కు పంపించారు.
Comments
Story first published: Tuesday, April 22, 2003, 23:53 [IST]