వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రలో లారీల సమ్మె విరమణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లారీ ఆపరేటర్స్ రాష్ట్రంలో సమ్మెనువిరమించుకున్నారు. ఈ విరమణ వెంటనే అమలులోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, లారీ యజమానులకు మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది.
అంతకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రవాణా శాఖ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డిలతో, ప్రభుత్వాధికారులతో ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులు పలుమార్లు సమావేశమయ్యారు. తమ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడంతో సమ్మెను విరమించుకున్నట్లు లారీ యజమానుల సంఘం నాయకులు చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 22, 2003, 23:53 [IST]