వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంతపురం జిల్లాలో కరువుదాడి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాలో నిషిద్ధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు బుధవారం తెల్లవారు జామున కరువుదాడి చేశారు.

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లిలో నక్సల్స్‌ ముగ్గురు భూస్వాముల ఇళ్లపై దాడి చేశారు. ఆస్తి మొత్తం దోచుకెళ్లారు. ఒక ఇంట్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేవారు. దాదాపు 20 లక్షల రూపాయల మేరకు నష్టం ఉంటుందని అంచనా.

నక్సలైట్లు ఆరేడు ట్రాక్టర్లలో గ్రామంలోకి ప్రవేశించారు. బాంబులు విసిరి ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఆ తర్వాత మూడు బృందాలుగా విడిపోయి ముగ్గురు రైతుల ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించారు. నగలు, ఇతర సామగ్రి దోచుకెళ్లారు. తాళిబొట్లను కూడా వదలలేదని బాధితులు చెప్పారు. దాదాపు గంట సేపు చంద్రారెడ్డి, శ్యాంసుందర్‌ రెడ్డి, చౌదరి ఇళ్లలో బీభత్సం సృష్టించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X