వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంతపురం జిల్లాలో కరువుదాడి
అనంతపురం: అనంతపురం జిల్లాలో నిషిద్ధపీపుల్స్వార్ నక్సలైట్లు బుధవారం తెల్లవారు జామున కరువుదాడి చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లిలో నక్సల్స్ ముగ్గురు భూస్వాముల ఇళ్లపై దాడి చేశారు. ఆస్తి మొత్తం దోచుకెళ్లారు. ఒక ఇంట్లో ఫర్నీచర్ను ధ్వంసం చేవారు. దాదాపు 20 లక్షల రూపాయల మేరకు నష్టం ఉంటుందని అంచనా.
నక్సలైట్లు ఆరేడు ట్రాక్టర్లలో గ్రామంలోకి ప్రవేశించారు. బాంబులు విసిరి ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఆ తర్వాత మూడు బృందాలుగా విడిపోయి ముగ్గురు రైతుల ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించారు. నగలు, ఇతర సామగ్రి దోచుకెళ్లారు. తాళిబొట్లను కూడా వదలలేదని బాధితులు చెప్పారు. దాదాపు గంట సేపు చంద్రారెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, చౌదరి ఇళ్లలో బీభత్సం సృష్టించారు.
Story first published: Wednesday, April 23, 2003, 23:53 [IST]