పవన్ వివాదంపై ఒత్తిళ్లు లేవు: బాబు
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కళ్యాణ్కు, డక్కన్ క్రానికల్ పత్రికకు మధ్య తలెత్తినవివాదం విషయంలో తనపై ఒత్తిళ్లు లేవని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అయితే ఈవివాదం పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఆయన బుధవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ వివాదంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన చెప్పారు. అయితే ఇటువంటివిషయాల్లో పత్రికలు కొంత సంయమనంతో వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా మంగళవారం తలెత్తిన ఘర్షణలపై ఆయన బుధవారంవిలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలుస్వల్పమేనని ఆయన అన్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో క్రమశిక్షణను ఉల్లంఘించిన నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెల్లూరులో ఐదుగురిని, నల్లగొండ జిల్లా రామన్నపేటలో ముగ్గురిని, వరంగల్లో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కరీంనగర్, కడప జిల్లా పులివెందుల విభేదాలపై వెంటనేవిచారణ చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం 513 మండల, డివిజన్, మున్సిపాలిటీ స్థాయి ఎన్నికలు జరిగాయి.