వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చొరబాట్లు ఆపితేనే చర్చలు: వాజ్పేయి
న్యూఢిల్లీ: చొరబాట్లకు అడ్డుకట్ట వేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడే పాకిస్థాన్తో చర్చలకు తలుపులు తెరుచుకుంటాయని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి స్పష్టం చేశారు. ఇటీవల తన కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో కొత్త శాంతి ప్రయత్నాలపై ఆయన బుధవారం లోక్సభలో ఒక ప్రకటన చేశారు.
భారత, పాకిస్థాన్ల మధ్య నూతన ప్రారంభానికివీలుంటుందనే ఆశాభావాన్ని తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. తాముస్నేహహస్తం చాస్తున్నామని తాను చెప్పానని, దీనికి పాకిస్థాన్ ప్రతిస్పందన ఏమిటో చూడాల్సి వున్నదని ఆయన అన్నారు. చర్చలే జరిగితే జమ్మూ కాశ్మీర్ సమస్యపైనే కాకుండా అన్నిఅంశాలపై జరుగుతాయని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, April 23, 2003, 23:53 [IST]