వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆశ్రిత్ హంతకుల పట్టివేత
హైదరాబాద్: లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు చిన్నారి కొడుకును కిడ్నాప్ చేసి, హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులనుసైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసం నిందితులుఈ పనికి పూనుకున్నట్లు పోలీసులు చెప్పారు.
లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న సూర్యనారాయణ కొడుకు సాయి ఆశ్రిత్ను లక్ష్మీనారాయణ చౌదరి, రవీంద్రలు కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. లండన్ నుంచి సూర్యనారాయణ దంపతులు హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా వారి కుమారుడు సాయి ఆశ్రిత్ను వారి బంధువైన లక్ష్మీనారాయణ రవీంద్ర సహకారంతో కిడ్నాప్ చేశారు. సాయి ఆశ్రిత్ ఏడుస్తుండడంతో బయటివారికివినిపిస్తుందని నిందితులు భయపడ్డారు. దీంతో ఆ బాలుడి ముక్కు, నోరు మూశారు. దీంతో సాయి ఆశ్రిత్ మరణించాడు. సాయి ఆశ్రిత్ శవాన్ని ఒక బ్యాగులోపెట్టి ముంబాయి వెళ్లే ఒక రైలు ఉంచారు.
Comments
Story first published: Thursday, April 24, 2003, 23:53 [IST]