ఎమ్సెట్కు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్కోర్సుల్లో ప్రవేశం కోసం ఎమ్సెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష శనివారం జరుగుతుంది. ఉదయం పూట పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్ ఎంట్రన్స్ టెస్టు జరుగుతుంది.
ఎమ్సెట్ అభ్యర్థులకు ఇప్పటికేహాల్ టికెట్లు పంపించారు. హాల్ టికెట్లు అందనివారు జవహర్లాల్ నెహ్రూ సాంకేతికవిశ్వవిద్యాలయం (జెఎన్టియు) వెబ్సైట్లో వివరాలు చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఉదయంగం. 5.45 నిమిషాలకు, మెడిసిన్ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాన్ని ఉదయం పదిన్నర గంటలకు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఎమ్సెట్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారి సంఖ్య తగ్గింది. నిరుడు లక్షా 94 వేల పై చిలుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ ఏడాది లక్షా 73 వేలపైలు మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.