ఇక పాఠశాల స్థాయిలోనే ఐ.టి విద్య!
హైదరాబాద్: ఇక రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీవిద్యను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది నుంచే దీన్ని అమలు చేసే అవకాశం ఉందని జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎన్ సిటిఇ) ఛైర్మన్ ప్రొఫెషర్ ఎ.ఎన్.మహేశ్వరి శుక్రవారం హైదరాబాద్ లో తెలిపారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని బి.ఇడి, ఎం.ఇడి కాలేజ్ లలోవిద్యార్థులకు ఐటి విద్యలో శిక్షణ ఇస్తున్నామన్నారు. మరో ఆర్నెళ్ళల్లోవీరు ఈ ఐటి విద్యలో శిక్షణ పొందుతారని, వచ్చే ఏడాది నుంచి పాఠశాల స్థాయిలో దీన్ని ప్రవేశపెడుతామన్నారు.
ఇందుకు కావాల్సిన సాంకేతిక సహాయాన్ని ఇంటెల్ సంస్థఅందచేస్తుందన్నారు. ప్రస్థుతం దేశంలో 14 విశ్వవిద్యాలయ ఫరిధిలో దీన్ని ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని బి.ఇడి కాలేజ్ ల్లో విధ్యాబోధనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ పాత పద్దతిలోనే బి.ఇడివిద్యార్థులు ట్రెయినింగ్ పొందుతున్నారు. వీరు కూడావిద్యార్థులకు అదే పద్దతిలో విద్య బోధన చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా బి.ఇడి కళాశాలల మంజూరును కూడా నిలిపివేసినట్లు మహేశ్వరి చెప్పారు.