వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణాల వసూళ్ళను నిలిపివేయాలి : వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరువు రైతుల నుంచి నిర్బంధ వసూళ్ళను బ్యాంకుల ఆపాలనిసీఎల్పీ నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. రైతులు పంటల ఆదాయం లేక అల్లాడుతుంటే, సహకారబ్యాంకులు రైతుల నుంచి రుణాల వసూళ్లను ముక్కుపిండి వసూలు చేయడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. మెదక్‌ జిల్లాల్లోని నామాంపూర్‌ గ్రామం నుంచి శుక్రవారం తన పాదయాత్రను ప్రారంభించిన వై.ఎస్‌ ముస్తాఫా మండలంలో పర్యటించారు.

బ్యాంకులు రుణాల వసూళ్ళపేరిట ఎలా వేధిస్తున్నది రైతులు ఆయనకువిన్నవించారు. ఏడ్పులు, పెడబొబ్బలతో మహిళలు తమ దీన స్థితిని వై.ఎస్‌.కు తెలియచేశారు. వారి బాధామయ గాథలను ఆలకించిన వై.ఎస్‌ చలించిపోయారు.

రుణాల వసూళ్ళను నిలిపివేయాలని ఆయన బ్యాంకు అధికారలకు సూచించారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధర్నాలు, ఆందోళనలతో బ్యాంకు అధికారుల జులుంను అడ్డుకుంటారన్నారు. పంటల బీమా పథకంలో అహేతుకమైన విధానాలను చేర్చి ప్రభుత్వం రైతులకు దక్కాల్సిన ప్రతిఫలాలు దక్కకుండా చేసిందని ఆయనవిమర్శించారు.

తెలుగుదేశం ప్రభుత్వం హుస్సేన్‌ సాగర్‌ నాలా వద్ద భూములను, ఇతర హోటళ్ళ యజమానులుకు భారీ ఎత్తున రాయితీలు ప్రకటిస్తూ, రైతులకు మాత్రం సబ్సిడీలు ఇచ్చేందుకు వెనుకాడుతోందని ఆయన ఘాటుగావిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X