వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ డిమాండ్ న్యాయమే: దేవగౌడ
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కావాలన్న ప్రజల డిమాండ్ న్యాయబద్దమేనైనదేని మాజీ ప్రధాని దేవగౌడ అన్నారు.అసలు ఈ డిమాండ్ ఈ నాటిది కాదని, దశాబ్దాలుగా ఈ డిమాండ్ నానుతోందని, ఇప్పటికైనా ప్రజల డిమాండ్ కు ప్రభుత్వాలుఅంగీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రసమితి చేపట్టిన వరంగల్ సభకు హాజరయ్యే ముందు ఆదివారం ఆయన హైదరాబాద్ లోవిలేకరులతో మాట్లాడారు. యాభై ఏళ్ళుగా సాగుతోన్న అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్రమంతటా సమతుల్యంగా జరుగుతున్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ అసమానతలను తొలగించాలంటే రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కమీషన్ అన్ని ప్రాంతాల అభివృద్ధినిఅంచనా వేసి, తన నివేదకను ఇస్తుంది, దాన్ని బట్టి నిర్ణయించాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Sunday, April 27, 2003, 23:53 [IST]