హెల్మెట్ ధారణ: గడువు పొడగింపుకు నో
హైదరాబాద్: మే 1 నుంచి రాష్ట్రంలోని టూవీలర్ యజమానులందరూ హెల్మెట్ లు ధరించడం తప్పని సరని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు పొడిగించాలన్న డిమాండ్ కు ప్రభుత్వంఅంగీకరించలేదు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యుల ప్రకారం టూవీలర్ లు నడిపే ప్రతివారు తప్పకుండా హెల్మెట్ లు ధరించాలి. ఏప్రిల్ 1 నుంచే దీన్ని అమలుపెట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ పలువురు పౌరులు, హెల్మెట్ తయారు చేసే కంపెనీల నుంచి వచ్చినవిజ్ఞప్తుల మేరకు మే 1 వరకు గడువును పెంచింది.
అయితే, మండుతున్న ఎండల నేపథ్యంలో వాహనదారులు ఎవరూ హెల్మెట్ లు ధరించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, తమ గడువు విధింపును పొడగించే ప్రసక్తి లేదనిట్రాన్స్ పోర్ట్ జాయింట్ కమీషనర్ ఎ.ఎల్.ఎన్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు, హైదరాబాద్ లో హెల్మెట్ ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగరంలోని కోఠీ ప్రాంతంలో మాత్రమే చౌకగా లభిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులుఅంతా అక్కడికే వెళుతుండగా, అక్కడ స్టాక్ లేదని వ్యాపారస్థులు వారిని తిప్పిపంపుతున్నారు.