ప్రత్యేక తెలంగాణ సాధిస్తాం: కేసీఆర్
వరంగల్: ప్రత్యేక తెలంగాణ కోసం తమపార్టీ చేపట్టిన జైత్రయాత్రవిజయవంతం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుపేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం జరిగి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన చేపట్టిన జైత్రయాత్రలో భాగంగా ఆదివారం వరంగల్ చేరుకున్నారు. ఉదయం సిద్దిపేటలోసైకిల్ పై బయలుదేరిన కె.చంద్రశేఖర్ రావు, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉత్సాహంగాసైకిల్ పై వరంగల్ కు సాయంత్రం చేరుకున్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇంకెంతో దూరం లేదని, త్వరలోనే ఏర్పడుతుందన్నారు.అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏడాదిలోపే జరగుతాయని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు ఈ సారి మట్టికొట్టుకుపోకుండా ఉండాలంటే ఆయన దగ్గరున్నఏకైక మంత్రదండం ఏడాదిలోపు ఎన్నికలు జరపడమేనని ఆయనవివరించారు.
అందుకే, తమ పార్టీ ఎన్నికల శంఖారావం వరంగల్ సభతో జరుపుతుందన్నారు. వరంగల్ లో సాయంత్రం జరిగే సభకు హాజరయ్యేందుకుపెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పోలీసులు సభకు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ వాదులు రావాలని చంద్రశేఖర్ రావుకోరారు.