వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న తీవ్ర కరువు దృష్ట్యా రైతులు బ్యాంకుల నుంచి తీసుకొన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలనివిపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం ఇప్పటికే రుణాలపై వడ్డీలను మాఫీ చేసినప్పటికీ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని లోక్ సభలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరింది.
కరువు రీత్యా రైతులు నయాపైసా కట్టే స్థితిలో లేనందున దీన్ని వెంటనే అమలు చేయాలని, ఈ పార్లమెంట్ సమావేశాలు ముగింపులోపు దీన్ని ప్రకటించాలని టీడీపీ సభ్యుడు ఎం.వి.వి.ఎస్ మూర్తికోరారు. అలాగే, ప్రస్తుతం అమలు చేస్తోన్న రిజర్వేషన్ల విధానాన్ని పునఃసమీక్షించాలని టీడీపీకి చెందినకె.ఎర్నన్నాయుడు, కాంగ్రెస్ కు చెందిన టి.రేణుకాచౌదరికోరారు. దీనిపై ఓ స్థాయిసంఘం ఏర్పాటు చేయాలని వారన్నారు.
Comments
Story first published: Monday, April 28, 2003, 23:53 [IST]