విశాఖ స్థాయిసంఘం టీడీపీ వశం
విశాఖపట్నం: అత్యంత కీలకమైనవిశాఖ మున్సిపల్ స్థాయీసంఘం ఛైర్మన్ పదవి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకొంది. నిజానికి ముగ్గురు వార్డ్పర్సన్ లు ఉన్న కాంగ్రెస్ ఈ పదవి సొంతం చేసుకోవాల్సి ఉండగా, సొంత పార్టీ వారే క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో ఆ పార్టీ ఖంగుతింది.
కోట్లాది రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్ట్ లను చేపట్టే ఈ స్థాయిసంఘంలోఅయిదుగురు సభ్యులు నిర్ణయాత్మక ఓటింగ్ చేసే సభ్యుల్లో ముగ్గురు కాంగ్రెస్ కు చెందిన వారుకాగా, ఇద్దరు టీడీపీకి చెందిన వారు. చివరివరకు పోటీల్లో పాల్గొనవద్దని భావించిన టీడీపీ ఆఖరినిమిషంలో ఆ పార్టీ అభ్యర్థి ముత్యాల నాయుడు పోటీలో నిలిచారు. క్రాస్ ఓటింగ్ పుణ్యామాని ఆయన ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
టీడీపీ డబ్బు కుమ్మరించి తమ పార్టీ సభ్యులను కొన్నది కాంగ్రెస్విమర్శించగా, టీడీపీ విజయోత్సవంతో సెలెబ్రేట్ చేసుకుంటోంది.విశాఖ స్థాయి సంఘం ఛైర్మన్ టీడీపీ వరుసగా నాలుగోసారి దక్కించుకొంది.