వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్, పోలీసులకు మధ్య హోరాహోరి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మల్లాపూర్ అటవీ ప్రాంతంలోమంగళవారం నిషిద్ధ పీపుల్స్వార్ నక్సలైట్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
వివరాల్లోకి వెళ్తే- మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు కూంబింగ్ చేపట్టిన పోలీసులకు పది మంది నక్సలైట్లు ఎదురయ్యారు. పోలీసులను చూడగానే నక్సల్స్ కాల్పులుప్రారంభించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుతూ నక్సలైట్లు అడవిలోకి పారిపోయారు. సంఘటనా స్థలం వద్ద పోలీసులకు రెండు తపంచాలు, పిస్తోలు, ఐదు క్లైమోర్ మైన్స్, రెండు వైర్లెస్సెట్లు, ఇతర సామగ్రి లభించాయి.
Story first published: Tuesday, April 29, 2003, 23:53 [IST]