వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అనంత కలెక్టర్ కార్యాలయం ముట్టడి
అనంతపురం: వేరుశనగ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంత ఆక్రందనపేరున నిర్వహించిన పాదయాత్రలు శుక్రవారం శుక్రవారం అనంతపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి.
ఈ ముట్టడి కార్యక్రమం ముందే తెలియడంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది తాళాలు వేసి విధులకుగైర్హాజరయ్యారు. ఈ సంఘటన ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని కాంగ్రెస్ నాయకులువిమర్శించారు. కాంగ్రెస్ కార్యక్రమానికి సిపిఐ మద్దతు ప్రకటించింది.
Comments
Story first published: Friday, May 2, 2003, 23:53 [IST]