సురేంద్ర అరెస్ట్ పై ప్రభుత్వం ఆచితూచి
హైదరాబాద్: విజయవాడ పోలీసు కమీషనర్ తో పాటు నలుగురు పోలీసు అధికారులనుఅరెస్ట్ చేయాలని విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఆచితూచి స్పందించనుంది. సురేంద్రబాబునుఅరెస్ట్ చేయాలని కోర్టు న్యాయమూర్తి డి.వెంకటరమణ తనతీర్పులో డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే, తనకి ఆదేశ పత్రాలు ఇంకాఅందలేదని, ఇప్పుడే దీనిపై తానేమీ వ్యాఖ్యానించలేనని డీజీపీపేర్వారం రాములు హైదరాబాద్ లో విలేకరులతో అన్నారు.
మర్డర్ కేసుగా కోర్టు తీర్పు ఇచ్చింది కదానివిలేకరులు ప్రశ్నించగా, అవును. నాకు కూడా మీరు చెపుతోన్న వార్తల బట్టి తెలిసింది. నాకు ఇంకా ఆదేశపత్రాలు రాలేదు. కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేను.. అని ఆయన అన్నారు. మరోవైపు, కోర్టు తీర్పు ప్రకటించగానే, హుటాహుటినవిజయవాడ నుంచి బయలుదేరి వచ్చిన సురేంద్రబాబు హైదరాబాద్ కు చేరుకొని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా ఆయన కలుసుకోనున్నారు. ఆయననుఅరెస్ట్ చేయాలని విపక్షాలు పట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సురేంద్రబాబు వైఖరి అన్నివిషయాల్లోనూ వివాదస్పదమే కావున ఆయనఅరెస్ట్ కు ఒత్తిడి అధికంగా ఉంది.