సురేంద్రబాబు అరెస్ట్ కు వారంట్ జారీ
విజయవాడ: విజయవాడ పోలీసు కమీషనర్ సహా ఐదుగురు పోలీసు అధికారులపైఅరెస్ట్ వారెంట్ లు జారీ అయ్యాయి. ఏడాది క్రితం ఓ లాకప్ డెత్ కేసులోవిజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు ఈ సంచలన తీర్పును ప్రకటించింది. ఈ ఐదుగురుపై నాన్ బెయిలబల్అరెస్ట్ వారంట్ జారీ అయింది.
వీరిపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నందునఅరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు శుక్రవారం విజయవాడ ఐదో మెట్రోపాలిటన్ జడ్జి డి.వెంకటరమణ తీర్పునిచ్చారు. ఈ సంచలనాత్మక కేసు పూర్తివివరాలు.. ఏడాది జూలైలో నగర కాంగ్రెస్ నేత ఈడ్పుగండి సత్యనారయణ హత్య కేసులో ఇద్దరినివిజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గవర్నర్పేట పోలీసు స్టేషన్ లో ఉంచారు. అనంతరం 14వ తేదీన లాకప్ లోవీరు ఇరువురు మృతి చెందారు.
ఎస్.ఐ వద్ద నుంచి రివాల్వర్ లాక్కొని ఎస్.ఐపై కాల్పులు జరపేందుకువీరు ప్రయత్నించగా, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని,పర్వసనంగ వారు మరణించారని అప్పట్లో పోలీసులు తెలిపారు ఇది పోలీసులు పన్నిన కుట్రగాపేర్కొంటూ విజయవాడ బార్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసునువిచారించిన జడ్జి శుక్రవారం ఈ తీర్పును ఇచ్చారు.
కమీషనర్ సురేంద్రబాబు,అసెస్టింట్ కమీషనర్ జె.శ్రీనివాస్, మరో ముగ్గురు పోలీసులపై ప్రాథమిక ఆధారాలున్నాయిని కోర్టు తెలిపింది. కుట్ర, హత్యానేరం తదితర సెక్షన్ల కింద వీరిని అరెస్ట్ చేయాలని కోర్టు తీర్పును ఇచ్చింది.