వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదాలు: ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

మరణించినవారందరూ విద్యార్థులే. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయగడ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరువిద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరు ఒంగోలులో ఎపిఆర్డీసి పరీక్షకుహాజరై తిరిగి వస్తున్నారు. వీరిద్దరు ఎర్రగొండ్ల పాలెంకు చెందినవారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలం నందిగాం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X