వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిరత్నం సోదరుడు జీవీ ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ నిర్మాత, దర్శకుడు మణిరత్నం సోదరుడైన జి.వెంకటేశ్వరన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఆయన తన చెన్నైలోని తన నివాసగృహంలోనే ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాన్‌ కు ఉరివేసుకొని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తమిళంలో పలువిజయవంతమైన చిత్రాలు నిర్మించిన వెంకటేశ్వరన్‌ ఇటీవల కాలంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆయనకు 55 ఏళ్ళు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. కుమారుడు సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తుండగా, కూతురుపెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన భార్య పనిమీద కొడైకనైల్‌ వెళ్లగా, ఆయన మధ్యాహ్నంస్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం కూడా ఆయన మామూలుగానే ఉన్నట్లు పనిమనిషి తెలిపారు.

మధ్యాహ్నం బ్యాంకు పనిమీద బయటికి వెళుతానని కూడా ఆయన పనిమనిషితో చెప్పారని పోలీసులు తెలిపారు. అనంతరం వెంటనే ఆయన తన రూంలోకి వెళ్ళి తలుపేసుకొన్నారు. ఎంతకీ రూం నుంచి బయటికి రాకపోవడంతో పని మనిషి తలుపులుతన బలం అంతా ఉపయోగించి తలుపులు తెరిచి చూడగా, ఫ్యాన్‌ కు జీవీ శవం వేలాడుతూ కనిపించింది. వెంటనే అతను పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారంఅందించాడు. ఆయన ఇటీవల నిర్మించిన పలు చిత్రాలుఅపజయం పాలయ్యాయి.

ఆయన మరణవార్త తెలిసిన వెంటనే తమిళ చిత్రరంగానికి చెందిన ప్రముఖులంతా ఆయన ఇంటిని సందర్శించారు. నటుడు రజనీకాంత్‌, ఏవిఎమ్‌ శరవణన్‌ వంటి ప్రముఖులు ఈ ఉదయం ఆయన మృతదేహం వద్ద శ్రద్దాంజలి ఘటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X