వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్ పేయికి జమాలీ ఆహ్వానం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పర్యటనకు రావాల్సిందిగా మరోమారు ఆ దేశ ప్రధాని మీర్ జరాఫుల్లా ఖాన్ జమాలీ ప్రధాని వాజ్ పేయికి లాంఛనంగా ఆహ్వానం పంపారు. భారత-పాక్ ల మధ్య తిరిగి దౌత్య సంబంధాలు ప్రారంభం కావాలని ఇరు దేశాలు తీసుకొన్న నిర్ణయం అనంతరం ఆయన ప్రధానిని తమ దేశపర్యటనకు ఆహ్వానం పలికారు.
ఇస్లామాబాద్ లోని భారత తాత్కాలిక హైకమీషనర్ టి.సి.ఎ.రాఘవన్ కు శనివారం జమాలీ ఆహ్వానలేఖను అందచేశారు. అంతకుముందు జమాలీ అమెరికా విదేశాంగ కార్యదర్శి కొలిన్ పావెల్ తో టెలిఫోన్ లో సంభాషించినట్లు తెలిసింది. పావెల్ సూచన మేరకే ఆయన లాంఛనంగా ఈ ఆహ్వానాన్ని పంపినట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Saturday, May 3, 2003, 23:53 [IST]