సురేంద్రబాబు విజయవాడకు దూరం?
హైదరాబాద్: విజయవాడ పోలీసు కమీషనర్ సురేంద్రబాబు సహా ఐదుగురు పోలీసులను ఓ లాకప్ డెత్ కేసులో నిందితులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయనను విజయవాడ పోలీసు కమీషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కోర్టు కమీషనర్ నే నిందితుడిగా పేర్కొన్నందున ఆయన అధ్వర్యంలో విచారణ సక్రమంగా అవకాశం లేదని నిపుణులు ప్రభుత్వానికి శనివారం సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ, రాష్ట్ర హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ గానీ ఈ విషయంపై ఇప్పటివరకు మీడియాతో మాట్లాడలేదు.
ఇప్పుడిప్పుడే దీనిపై స్పందించకూడదనని ప్రభుత్వనిర్ణయంగా కన్పిస్తోంది. అయితే, సురేంద్రబాబును విజయవాడకు దూరంగా మరో ప్రాంతానికిగానీ, మరో పోస్ట్ కు గానీ ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంది. అసలే పలు రాజకీయ సమస్యలు ముప్పిరిగొన్న ప్రస్తుత దశలో అధికారులకు కొమ్ము కాయడం మంచిది కాదని తెలుగుదేశం సీనియర్ నాయకులు చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది.