వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోదారి పుష్కరాలకు కేంద్ర సహాయం
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు కేంద్ర సహాయం కోరుతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆయన ఆదివారంనాడు గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు.
గోదావరి పుష్కరాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహిస్తామని ఆయన విలేకరులతో చెప్పారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, మరో 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని ఆయన చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంట్లు కోరుతున్నామని, ఈ గ్రాంట్ల కోసం ఇద్దరు ఐఎఎస్ అధికారులను నియోగించామని, కేంద్ర నిధులు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లకు నిధులు విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Sunday, May 4, 2003, 23:53 [IST]