నన్ను అవమానపర్చారు: జయలలిత
చెన్నై: తనను అవమానపర్చినందుకే ఆదివారం ప్రధాని వాజ్ పేయి పాల్గొన్న సమావేశానికి గైర్హాజరు అయ్యానని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వివరణ ఇచ్చారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే ఎల్.శాంతానం ప్రశ్నకు ఆమెకు సమాధానమిస్తూ..ఆ సమావేశంలో తనకు ఓ మూల కుర్చీవేశారని తెలిపారు. అది తనకు సరైనా విధమైన గౌరవం ఇవ్వకుండా, అవమానపర్చడేమనన్నారు.
ముఖ్యమంత్రైన తనకు ఓ మూల కుర్చీ వేసి, ఆ సమావేశానికి సంబంధం లేని కేంద్రపర్వావరణశాక మంత్రి టి.ఆర్.బాలుకు మాత్రం ప్రధాని పక్కనే సీటు ఇవ్వడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జయలలితకు గౌరవం ఇచ్చినా ఒక్కటే ఇవ్వకున్నా ఒక్కటే. నేను పట్టించుకోను. కానీ ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కదా! ముఖ్యమంత్రి ప్రధాని పక్కనే కూర్చునేలా చూడాలి కదా!అని ఆమె అడిగారు.
ఇదంతా టి.ఆర్.బాలు చేసిన పనేనని జయలలిత ఆరోపించారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫ్యాక్స్ లో తనకు కార్నర్ సీటు అప్పగించినట్లు స్పష్టం చేసినట్లు ఆమె సభకు వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రాయినికి అన్నాడిఎంకె వ్యవస్థాపక నేత ఎం.జి.రామచంద్రన్ పేరు పెడితామని తొలుత మాట ఇచ్చిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాట తప్పిందని దొప్పిపొడిచారు. టి.ఆర్.బాలు ప్రధాని వద్ద తనకున్న పలుకుబడిని ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ఉపయోగించుకోవడానికి కాకుండా, కరువు నిధుల కేటాయింపుకోసం ఉపయోగిస్తే మంచిదని ఆమె అన్నారు.