వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంఎంటిఎస్ బోగీలను చూసిన మంత్రులు
చెన్నై: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రవేశపెట్టదలచిన మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఎంటిఎస్) బోగీలను రాష్ట్ర మంత్రులు టి. దేవేందర్ గౌడ్, కె. విజయరామారావు మంగళవారం సందర్శించారు. చెన్నైలోని ఐసిఎఫ్ ఈ బోగీలను తయారు చేస్తోంది.
గతంలో ఐసిఎఫ్ రూపొందించి బోగీల డిజైన్ పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు సూచన మేరకు ఐసిఎఫ్ బోగీల డిజైనింగ్ను, రంగును మార్చివేసింది. ఈ కొత్త కోచ్లను రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. వీటి వివరాలను రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి వివరిస్తారు. అనంతరం వాటిని హైదరాబాద్కు తరలిస్తారు.
Comments
Story first published: Tuesday, May 6, 2003, 23:53 [IST]