వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప జిల్లాలో నక్సల్స్‌ విధ్వంసం

By Staff
|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు మంగళవారం తెల్లవారుజామున విధ్వంసానికి పాల్పడ్డారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా తాము ఈ విధ్వంసానికి దిగినట్లు నక్సలైట్లు వదిలివెళ్లిన లేఖలో పేర్కొన్నారు.

పుల్లంపేట రైల్వే స్టేషన్‌ను పేల్చివేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ను, ఇతర ఉద్యోగులను బయటకు పంపి ఈ చర్యకు పాల్పడ్డారు. మరో చోట ఫారెస్టు రేంజ్‌ ఆఫీసు విధ్వంసానికి పాల్పడ్డారు. సారాబాయిలోని ఆంధ్రాబ్యాంకును పేల్చేయడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటన్నర ప్రాంతంలో నక్సల్స్‌ ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇందులో లుంగీలు ధరించిన 12 మంది నక్సల్స్‌ పాల్గొన్నట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఇందులో ఆరుగురు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X