లతకు ఆమె కొడుకును అందచేస్తాం: కోడెల
హైదరాబాద్: నయాపూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డ తారుమారైన కేసులో ప్రభుత్వం దర్యాప్తును ప్రారంభించింది. ఒక వైపు పోలీసులు ఆసుపత్రి సిబ్బిందిపై లైడిటెక్టర్ లతో పరీక్షలు నిర్వహిస్తుండగా, మరోవైపు గత నెల 13 -15 వ తేదీలలో పుట్టిన శిశువుల డీఎన్ ఎ పరీక్షలను వైద్యనిపుణులు నిర్వహిస్తున్నారు. బాధితురాలు లతకు న్యాయం ఆమె కొడుకును ఆమె చేరేలా చూస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాద్ రావు అన్నారు.
ఈ మేరుకు ఆయన లతకు మంగళవారం హామీ ఇచ్చారు. ఆయన నయపూల్ ఆసుప్రతిలో తనీఖీ నిర్వహించారు. అన్నికోణాల్లో పరిశోధన చేపడుతున్నామని ఆయన అన్నారు. లతను పరామర్శించిన అనంతరం ఆయన ఆసుప్రతిలోని సౌకర్యాలను పరిశీలించారు.
రోగుల బంధువుల ఆసుప్రతి సిబ్బంది అవినీతిని మంత్రికి వివరించారు. మగబిడ్డకు 300, ఆడబిడ్డ 200 రూపాయలు ఆసుపత్రి సిబ్బంది అడుతున్నారని వారు మంత్ఇరకి తెలిపారు. రక్తపరీక్షలకే ఒక్కో పేషేంట్ కు వెయ్యిరూపాయలు ఖర్చు అవుతోందని ఓ మహిళ మంత్రికి చెప్పారు.