వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ట్రాఫిక్ కాల్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ కాల్సెంటర్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కాల్ సెంటర్ను హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.
ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటామని ఆయన చెప్పారు. ఏ వాహనమైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే తెలుసుకునే సదుపాయం దీని వల్ల ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
వాహనాల రిజిస్ట్రేషన్ ద్వారా వివరాలు తెలుసుకునే ఈ ఆన్లైన్ వ్యవస్థ వైర్లైస్ ద్వారా పని చేస్తుంది. ఈ వ్యవస్థను ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోనే ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.
Comments
Story first published: Wednesday, May 7, 2003, 23:53 [IST]