వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సజావుగా సాగుతోన్న టీడపీ ఎన్నికలు
హైదరాబాద్: వచ్చే ఏడాది శాసనసభా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ కమిటీ ఎన్నికలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి.
జిల్లాల వారీగా పార్టీ పరిశీలకుల అధ్యక్షతన ఈ ఎన్నికలు జరగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కమిటీ అధ్యక్ష పదవులకు పోటీ ఉన్నప్పటికీ అంతటా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చూస్తున్నామని హైదరబాద్ జిల్లా పార్టీ పరిశీలకుడు, మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాల్లో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఇద్దరు పోటీపడుతున్నారు. మరోవైపు, కర్నూలులో ఎస్వీసుబ్బారెడ్డి వర్గం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. కృష్ణా జిల్లాల్లో టి.డి.జనార్ధన్ ఎన్నిక దాదాపు ఖరారు అయింది.
Comments
Story first published: Wednesday, May 7, 2003, 23:53 [IST]