వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏడాదిలోపు పదిలక్షల కొత్త ఇళ్లు:బాబు
విజయవాడ: వచ్చే పది నెలల్లో నెలకు లక్షకు తగ్గకుండా కొత్తగా ఇళ్ళ నిర్మాణం చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మొత్తం పదిలక్షల ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
కృష్ణాజిల్లాల్లో ఆయన గురువారం అంతా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని వెల్లటూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ..బడుగువర్గాల వారికి ఇళ్ళను ప్రదానం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్దాంతాల్లో భాగమని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యంలో లక్షన్నర ఇళ్ళను పూర్తిచేశామని తెలిపారు. కరువు తీవ్రంగా నెలకొని ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని రైతులను ఆదుకుంటోందని చంద్రబాబు ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ వారు పాదయాత్రలు, ఇతర యాత్రలంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు.
Comments
Story first published: Thursday, May 8, 2003, 23:53 [IST]