వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీఎస్ ఎల్ వి ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: ప్రతిష్టాత్మకమైన జియో సింక్రనస్ శాటిలైట్ లాంఛ్ వెయికల్ (జిఎస్ ఎల్ వి- డి2)ను గురువారం సాయంత్రం 4.58 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించారు. 1800 కిలోల బరువుగల జిశాట్-2 ఉపగ్రహాన్ని జిఎస్ ఎల్ వి-డి2 శ్రీహరికోట అంతరిక్షకేంద్రం నుంచి నింగిలోకి ఎగిసింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్విరామంగా శ్రమించిన శాస్త్రవేత్తలు, నిపుణులు, ఇస్రో ఛైర్మన్ కస్తూరి రంగన్ అందరూ ఎంతో ఆనందంగా ప్రయోగాన్ని తిలకించారు.
నిర్దేశితంగా జిఎస్ ఎల్ వి ప్రయాణించగానే కస్తూరి రంగన్ తన సహచర శాస్త్రవేత్తలను ఆయన ఆలింగనం చేసుకొని అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని వాజ్ పేయి సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఈ ప్రయోగంతో కమ్యూనికేషన్ల రంగంలో భారత్ మరింత పటిష్టస్థితికి చేరుకొంది.
Comments
Story first published: Thursday, May 8, 2003, 23:53 [IST]