ఎంట్రన్స్లో గోదావరి జిల్లాలు టాప్
హైదరాబాద్: పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలో ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులు టాప్లో నిలిచారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యామంత్రి నేరెళ్ల ఆంజనేయులు శుక్రవారం విడుదల చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజపల్లికి చెందని కానూరి శరత్ చంద్ర మొదటి ర్యాంక్ సాధించగా, అదే గ్రామానికి చెందిన సుందరరామరాజు రెండో ర్యాంక్ సాధించాడు. బాలికల్లో రాజమండ్రికి చెందిన కొల్లి సమీర మొదటి స్థానంలో, శ్రీలత రెండో స్థానంలో నిలిచారు. ఉండ్రాజపల్లికి చెందిన లక్ష్మీ ప్రశాంతికి మూడో స్థానం లభించింది.
ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 49,500 మంది విద్యార్థులు హాజరు కాగా 43,138 మంది పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సంపాదించారు. ఈ నెల 17వ తేదీ నాటికి ర్యాంక్ కార్డులు పంపిస్తామని మంత్రి చెప్పారు. వచ్చే నెల చివరిలోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడంతో, కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో పాలిటెక్నిక్ కోర్సులకు ఆదరణ తగ్గింది.