వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపప్రధాని అద్వానీకి అమెరికా ఆహ్వానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి రిచర్డ్‌ ఆర్మిటేజ్‌ శనివారం ఉపప్రధాని ఎల్‌.కె.అద్వానీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన అద్వానీతో చర్చలు జరిపారు. పాక్‌ తో భారత్‌ సంబంధాలపైన ప్రధానంగావీరు చర్చించారు. అమెరికాను సందర్శించాలని ఆ దేశ ఉపాధ్యాక్షుడు డికిషెనీ ఉపప్రధాని అద్వానీని ఆహ్వానిస్తూ ఓ లేఖనుపంపారు.

ఈ లేఖను ఆర్మిటేజ్‌ అద్వానీకిఅందచేశారు. అద్వానీ అమెరికా సందర్శనకు అంగీకరించారని, బహుశా వచ్చేనెల ఆయన అధికారంగా అమెరికాలో పర్యటించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం కలిసినవిలేకరులతో ఆర్మిటేజ్‌ చర్చల వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. విదేశాంగ కార్యదర్శి కన్వల్‌ సిబాల్‌, హోంశాఖ కార్యదర్శి ఎన్‌.గోపాలస్వామి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X