సాగరతీరాన పుష్పకవిమానాల చక్కర్లు
హైదరాబాద్: సమ్మర్ లోహైదరాబాద్ నగర ప్రజలను వైమానికదళం నిర్వహించిన సైనిక విన్యాసాల ప్రదర్శనుఅబ్బురపరిచింది. 2001వ సంవత్సరం తర్వాత వరుసగా రెండోసారి భారతవైమానిక దళం హుస్సేన్ సాగర్ తీరాన పీపుల్స్ ప్లాజావద్ద శనివారం వైమానిక విన్యాసాల ప్రదర్శననునిర్వహించింది. ఈ ప్రదర్శనకు గవర్నర్ సూర్జీత్ సింగ్బర్నాలా, వైమానిక దళ ప్రధానాధికారికృష్ణస్వామి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. భారీ ఎత్తుననగర ప్రజలు తరలివచ్చారు.
చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్న ఈవైమానిక ప్రదర్శనతో భారతీయ వైమానికదళ శక్తి సామార్థ్యాలు మరోసారి నిరూపితమైనాయి. రెండుపుష్పకవిమానాలు (చేతక్ హెలికాప్టర్లు) పుష్పవర్షం కురిపిస్తూవిన్యాసాలను ప్రారంభించాయి. అనంతరం జాగ్వార్ లు తమవిన్యాసాలను ప్రదర్శించగా, పారాసెయిలింగ్ బృందంసాగరజలాలపై తేలియాడుతూ...చక్కర్లుకొట్టారు. ఉదయం ఎనిమిది గంటలకుప్రారంభమైన ఈ ఎయిర్ షో రెండు గంటల పాటు తమనగరప్రజలను అబ్బురపరిచింది.