వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆగస్ట్ 15 నుంచి మెట్రోరైలు పరుగు
హైదరాబాద్: హైదరాబాద్ లో మల్టీమోడల్ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ లో భాగంగా ప్రవేశపెట్టనున్న మెట్రోరైలు ఈ ఆగస్ట్ నుంచి ప్రారంభం అవుతుందనిరైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. చెన్నై నుంచి వచ్చిన మెట్రోరైలు కోచ్ ల పనితీరుపై రాష్ట్రప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. శనివారం హైదరాబాద్ లో ఆయనరైలునిలయంలో ఉన్నతాస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రైల్వే ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులు, ఇతర అధికారులతో ఆయన మెట్రోరైలుపై చర్చించారు. జూలై నుంచి ట్రయల్ రన్ నడుస్తుందని, ఆగస్ట్ 15 నుంచి మొదటి దశ మెట్రోరైలు ప్రారంభమవుతుందని దత్తాత్రేయ తెలిపారు. రెండో దశ పనులు నవంబర్ లో మొదలువుతాయని చెప్పారు. మెట్రోరైలు కోసం సికింద్రాబాద్ లో ప్రత్యేకరైల్వే స్టేషన్ నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Story first published: Saturday, May 10, 2003, 23:53 [IST]