జోరు తగ్గించుకుంటోన్న సురేంద్రబాబు
విజయవాడ: కోర్టులో లొంగిపోయి బెయిల్మీద విడుదలైన పోలీసు కమీషనర్ ఎన్.సురేంద్రబాబు మునుపటి దూకుడు తగ్గించుకున్నట్లు కన్పిస్తోంది. గతంలో మీడియా, న్యాయవ్యవస్థలనుపెద్దగా ఖాతరు చేయనట్లుగా ప్రవర్తించిన సురేంద్రబాబు శనివారంవిజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్ని వ్యవస్థలపై తనకున్న గౌరవాన్ని ప్రకటించుకున్నారు.
కొందరు వ్యక్తులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఏనాడూ ఏ వ్యవస్థపై వ్యాఖ్యలు చేయలేదు. దురుసుగా ప్రవర్తించలేదని ఆయన అన్నారు. ఆయనకు మద్దతుగా శుక్రవారంవిజయవాడలో భారీ ర్యాలీ జరిగింది. అందులో తన ప్రమేయం ఏమీలేదన్నారు.
ర్యాలీ పాల్గొన్న ప్రజలతో నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు. నా వల్ల, నా పనితీరు వల్ల వారు గానీ, వాళ్ళ కుటుంబ సభ్యులుగానీ, బంధువులు గానీ లాభపడి ఉంటారు. నా పనితీరుపై ఉన్న అభిమానం వల్లే ప్రజలు ర్యాలీ జరిపి ఉండవచ్చని సురేంద్రబాబు అభిప్రాయపడ్డారు.