వైఎస్ ప్రజాప్రస్థానం సీడి విడుదల
హైదరాబాద్: సీఎల్పీ నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి నెల రోజుల క్రితం ప్రారంభించిన ప్రజాప్రస్థానంలోని వివిధఅంశాలు, విశేషాలతో కూడిన ప్రత్యేక సీడీని కాంగ్రెస్ విడుదల చేసింది. రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వై.ఎస్ చేపట్టిన పాదయాత్రకు సంబంధించిన దృశ్యాలు, వార్తాకథనాలను ఇందులో పొందుపర్చారు.
ఈ ప్రత్యేక సీడీని హైదరాబాద్ లోపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు విడుదల చేశారు. కాంగ్రెస్సీనియర్ నేత రోశయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీడీని విడుదల చేయడం ఆవశ్యకత గురించి సత్యనారయణవివరిస్తూ..వేరే జిల్లాల్లో ఉన్న ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు వై.ఎస్. పాదయాత్ర గురించి సవివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సీడీ విడుదల చేయడంలో తప్పు ఏమీ లేదన్నారు.
మరోవైపు, ఇటీవల టీడీపీ కోర్టుకు ఇచ్చినవివరణలో గత ఏడాది ఆగస్ట్ 15 నుంచి నిరంతరంగావిద్యుత్ ను అందచేస్తామని ఎప్పుడూ వాగ్దానం చేయలేదని చెప్పడాన్ని రోశయ్య తప్పుబట్టారు. కోర్టును ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.