లతఒడిలోకి తప్పిపోయిన బాబు
హైదరాబాద్: నయాపూల్ ఆసుప్రతిలో తారుమారైన మగబిడ్డ ఎట్టకేలకు తల్లి ఒడిలోకి చేరుకున్నాడు. తారుమారైన బాబును తల్లి లతకు సోమవారం ఉదయం పోలీసులుఅందచేశారు. ఈ కేసులో అనుమానితురాలైన మహబూబా బేగం వద్ద ఈ మగబిడ్డను పోలీసులు కనుక్కొన్నారు. వెంటనే ఆ బిడ్డను తీసుకొని వచ్చి లతకు సోమవారం తెల్లవారుఝామున నాలుగు గంటలకుఅందచేశారు.
నెల రోజుల క్రితం నయాపూల్ ఆసుపత్రిలో మగబిడ్డను ప్రసవించిన లతకు మర్నాడు అమ్మాయినిఅందచేయడంతో మొదలైన ఈ ప్రహసనం సోమవారంతో దాదాపు ముగిసింది. తనకు పుట్టిన మగబిడ్డనుఅందచేస్తేనే ఆసుప్రతి నుంచి కదులుతానని పట్టుబట్టిన లతకు ఆమెకు బిడ్డనుఅందచేసినప్పటికీ, ఈ మగబిడ్డ డీఎన్ ఎ పరీక్ష ఇంకా నిర్వహించాల్సి ఉంది.
తప్పిపోయిన ఈ మగబిడ్డ కోసం పోలీసులుపెద్ద ఎత్తున పరిశోధన మొదలుపెట్టారు. చివరికి ఆసుపత్రిలో పనిచేసే మహబూబా బేగంను అనుమానించి, ఆమెను పట్టుకోవడంతో మగబిడ్డ దొరికాడు. మరోవైపు, లత తన బిడ్డ కాదని తిరస్కరించిన ఆడశిశువును మహబూబా బేగం దంపతులకుఅందచేశారు. ఈ శిశువు తమ కూతురేనని వీరుఅంగీకరించారు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఈ ఆడబిడ్డను వారికి వైద్యులుఅందచేశారు.