వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరులో తెలుగు తమ్ముళ్ల వీరంగం
గుంటూరు: సంస్థాగత ఎన్నికలు ముగిసినప్పటికీ తెలుగుదేశం జిల్లా నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోలేదు. గుంటూరు జిల్లాలో సోమవారం తెలుగుతమ్ముళ్లువీరంగం చేశారు.
శాసనసభ్యుడు నరేంద్రను పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రత్యర్థి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకినేనిపెద రత్తయ్యను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించనందుకు ఆందోళనకు దిగింది. జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేసింది. కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
Story first published: Monday, May 12, 2003, 23:53 [IST]