వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజ్ఞాన్‌ కు 27 ర్యాంకులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఉత్తమ ఫలితాలు సాధించాలంటేవిద్యా సంస్ధల్లో ఉన్నత ప్రమాణాలు ఉండాలని విజ్ఞాన్‌విద్యాసంస్ధల చైర్మన్‌ డాక్టర్‌ ఎల్‌ రత్తయ్య అన్నారు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరంలోవిజ్ఞాన్‌ విద్యాసంస్ధలు అత్యధిక ర్యాంకులు సాధించిన సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ ఏడాది ఈ సంస్ధ నుంచి మొత్తం 2209 మందివిద్యార్ధులు హాజరు కాగా అందులో 2074 మందికి ఫస్ట్‌ క్లాసులు వచ్చాయి. మొదటి పది ర్యాంకులలో ఈ సంస్ధకు చెందినవిద్యార్ధులు 27 మంది ఉండడం విశేషం.

విద్యార్ధులకు మంచి వసతి, ఆహార సదుపాయాలు, వారి ప్రతిభను వెలికి తీయగల ఉత్తమ ఉపాధ్యాయులు ఉండాలని అప్పుడే నిజమైన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. ఈ ఏడాది బిట్స్‌ పిలానీలో 962 మార్కులుఆపైన వచ్చే విద్యార్ధులకు సీట్లు వచ్చే అవకాశముందనివిజ్ఞాన్‌ కు చెందిన రెండొందల మందికి బిట్స్‌ పిలానీలోసీట్లు రావచ్చని ఆయన అన్నారు. ఇప్పుడు ర్యాంకులు సాధించిన తమవిద్యార్ధులు టెన్త్‌ లో ఇంత విశేష ప్రతిభ కనబర్చిన వారు కాదని రత్తయ్య అన్నారు. మామూలువిద్యార్ధులను మాణిక్యాలుగా తీర్చిదిద్దగలిగినప్పుడే ఆవిద్యా సంస్ధ ప్రతిభ బయటపడుతుందని చెప్పారు.విద్యారంగంలో అనారోగ్యకర పోటీ, మార్కెటింగ్‌ పోకడల పట్ల ఆయనవిచారం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్‌ కళాశాలలఫీజులనునిర్ణయించిందని, ఇక మీదట ప్రతిభావంతులకు ఫ్రీసీట్లు ఉండవని దీనివల్ల పేద విద్యార్ధులకు ఉన్నతవిద్యావకాశాలు దూరమవుతాయని రత్తయ్య అన్నారు.అందరూ పాతిక వేల ఫీజు కట్టవలసి రావడం దురదృష్టమని చెప్పారు. తమ సంస్ధ పరిధిలో ఉన్న మూడు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సామాజిక బాధ్యతను దృష్టిలో ఉంచుకునిపేద విద్యార్ధులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులు ఉన్నతవిద్యకు దూరం కాకూడదన్నది తన అభిమతమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X