వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతుల తిరుగుబాటుకు వైయస్సార్ పిలుపు
ఏలూరు: సహకార రుణాలు, విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి వచ్చే అధికారులపై తిరగబడాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఆయన పాదయాత్ర సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.
సహకార రుణాలు వసూలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే తన మాటకు కట్టుబడకుండా అధికారుల చేత వాటిని వసూలు చేయిస్తోందని ఆయన అన్నారు. సహకార రుణాలు,విద్యుత్ బకాయిలు చెల్లించవద్దని ఆయన రైతులకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేవిద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని ఆయన చెప్పారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను పాదయాత్ర ప్రారంభించలేదని, అలా ఇయితే ఎన్నికలకు మూడు నెలల ముందు పాదయాత్ర ప్రారంభించి వుండేవాడినని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, May 12, 2003, 23:53 [IST]