టాప్-50 లిస్ట్ లో అరుంధతీ నవల
లండన్: మహిళలు రాసిన 50 ప్రపంచ ఉత్తమనవలలలిస్ట్ లో ప్రఖ్యాత భారతీయ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీతఅరుందతీ రాయ్ నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు చోటు లభించింది. అరుంధతీ నవల 20 స్థానాన్నికైవసం చేసుకొంది. ఈ టాప్ టెన్ - 50 లిస్ట్ లో అధికంగా క్లాసిక్స్కే అగ్రతాంబులం దక్కగా, అరుంధతీ నవలకు చోటు లభించడంవిశేషం. తొలి స్థానం జేన్ ఆస్టిన్ క్లాసిక్ నవల ప్రైడ్ అండ్ ప్రిజ్యుడిస్కి దక్కింది.బ్రిటన్ కు చెందిన ఓ పబ్లిషింగ్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
మొత్తం ఆరువేల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. జేన్ ఆస్టిన్, బ్రాంటే, హార్పర్ లీ వంటి ప్రఖ్యాత రచయిత్రుల నవలలే తొలి పది స్థానాలేకైవసం చేసుకున్నప్పటికీ మార్కెట్ ఫ్రెండ్లీ రచయిత్రల నవలలకు చోటు లభించింది.హార్రీ పాటర్ నవలలు మూడు టాప్ లిస్ట్ లో చేరగా, క్యాండీప్లాస్ నవలైనబ్రిడ్జెట్ జోన్సెస్ డైరీ 21 స్థానంలో నిలిచింది. జేడీ స్మిత్ వంటి యువరచయిత్రుల నవలలు కూడా ఈలిస్ట్ లో స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే, బిబిసి కూడా ఇలాంటేటాప్ -100 యూనీసెక్స్ లిస్ట్ ఒకటి శుక్రవారం విడుదల చేయనుంది.