వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చలకు వాజ్పేయి షరతులు అవే
మనాలి: సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పి, దేశంలోని ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేవరకు పాకిస్థాన్తో చర్చలు సాధ్యం కావని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి అన్నారు.
ఆరు రోజుల పర్యటన కోసం మంగళవారం ఇక్కడికి వచ్చిన ప్రధాని కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదం రూపుమాసిపోవడం అత్యవసరం కాబట్టి బేషరతుగా చర్చలు జరపాలనే పాకిస్థాన్ పిలుపులోఅర్థం లేదని ఆయన అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పకుండా చర్చలకు అనుకూల వాతావరణం ఎలా ఏర్పడుతుందని ప్రధాని ప్రశ్నించారు. సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి పలకడమే కాకుండా ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలను, వారి మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ ధ్వంసం చేయాలని ఆయన అన్నారు.
Story first published: Tuesday, May 13, 2003, 23:53 [IST]