వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పథకాలు దేశం భోజ్యం: వైయస్
ఏలూరు: ప్రభుత్వ పథకాలతో అధికార పార్టీ కార్యకర్తలే లాభపడుతున్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. ఆయన పాదయాత్ర శుక్రవారం నాడు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది.
జన్మభూమి కింద 2,260 కోట్ల రూపాయల పనులు చేపడితే పది శాతం పనులు కూడా జరగలేదని ఆయన అన్నారు. పనికి ఆహారం పథకం కూడా సరిగా అమలు కాలేదని ఆయన అన్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును తాను అలవోకగా ప్రస్తావించలేదని, ఈ డిమాండును తాము మొదటి నుంచి పట్టించుకుంటున్నామని ఆయన చెప్పారు.
Story first published: Friday, May 16, 2003, 23:53 [IST]