అభివృద్ధిలో మేమే బెస్ట్: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే ప్రస్తుతం అభివృద్ది ఎక్కువగా జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే రాష్ట్రం ప్రగతి సాధించిందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రతోనైనా అభివృద్దివిషయంలో పోలికకు సిద్దమని ఆయన అన్నారు.
సోమవారం ఉదయం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ట్రస్ భవన్లో మహానాడు ఏర్పాట్లపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నుంచి వారసత్వంగా వచ్చిన రుగ్మతలును తొలిగించి, గత మూడేళ్ళుగా కరువు కోరలు సాచి పీడిస్తున్నా, అభివృద్ధిని సాధించామని ముఖ్యమంత్రివివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోన్న అభివృద్ధిని, ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని పోల్చుకోమని ఆయనవిపక్షనేతలకు సవాల్ విసిరారు. దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా మారిందని తెలిపారు.